సాహో’ డైరెక్టర్ పెళ్లైపోయింది…


ప్రభాస్ తో సాహో చిత్రం డైరక్ట్ చేసిన సుజీత్ కు వివాహం జరిగింది. సుజీత్ గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జూన్ 10న సుజీత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. అలాగే పెళ్ళి కూడా అంతకంటే సింపుల్ గా నిన్న ఆదివారం రోజు జరిగింది. సిల్క్ కుర్తాలో సుజీత్‌, గులాబీ రంగు సిల్క్ సారీలో ప్రవల్లిక మెరిసిపోయారు.అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహంలో పాల్గొన్నారు.

కరోనా కారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సెలబ్రిటీ కూడా ఈ వెడ్డింగ్‌లో పాల్గొనలేదు. వెడ్డింగ్ ఫొటోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సుజీత్ వివాహం చేసుకున్నారన్న విషయాన్ని బయటపెట్టింది.

`నా ప్రియమైన స్నేహితుడు సుజిత్ సింగ్ జీవిత కాలం ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను. వీరిద్దరూ ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ సంతోషంగా వుండాలి` అని పోస్ట్ చేశారు.

ఇక సుజీత్ చేసుకున్న అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డెంటిస్ట్ అని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. సుజీత్ వివాహం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమకి ‘రన్ రాజా రన్’ సినిమాతో పరిచయమైన సుజీత్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఈ సినిమా యువి క్రియోషన్స్ లో నిర్మించారు. ఆ సినిమాతో ఈ యంగ్ డైరెక్టర్ డార్లింగ్ ప్రభాస్ ని ఆకట్టుకున్నాడు. దాంతో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో ‘సాహో’ ని తెరకెక్కించే ఛాన్స్ కొట్టాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్దాయిలో ఆడలేదు. అయినా కుర్రోడులో విషయం ఉందని గమనించిన చిరంజీవి మరో అవకాసం ఆయనకు రీమేక్ రూపంలో అందించారు.

ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ చిరంజీవి నటించబోయో మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ని తెరకెక్కించే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు అలాగే తెలుగు నేటివిటీ కి తగ్గట్టు స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా సన్నాహాలో ఉన్నాడు.

About The Author