టాలీవుడ్ లో మరో దర్శకునికి కరోనా…


టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతుంది. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ గా తేలింది. గత వారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆయన ముంబైకి వెళ్లాడు. అప్పుడే ఆయనకు కరోనా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తేజ..కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన సీత సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం గోపీచంద్, రానా హీరోలుగా రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. కరోనా తగ్గిన తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్ ను తేజ మొదలు పెట్టనున్నాడు. తాను క్షేమంగానే ఉన్నానని తనను కాంటాక్టు అయిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తేజ కోరాడు

About The Author