ఒక్క ఛాన్స్ ఇవ్వండి… కరోనా పాజిటివ్ రోగిని 24 గంటల్లో క్యూర్ చేస్తాను.-డాక్టర్ వి.ఎస్.రెడ్డి..


వరంగల్ జిల్లాలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వి. ఎస్.రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ
హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ మెడిసిన్ (GNM) German New Medicine ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని చెప్పారు.

హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు గానీ, సిబ్బంది కానీ,డాక్టరు కుమారుడు గాని మాస్క్,సానిటైజర్స్ గత 120 రోజులుగా వాడలేదనీ, హాస్పిటల్ గుమ్మం ముందు ప్రతీరోజూ ఒక లిక్విడ్ చల్లుతామనీ దాని వల్ల,ఎంత మంది కరోనా పాజిటివ్ రోగులు ప్రవేశించినా వైరస్ లోపలికి రాదని ఛాలెంజ్ చేసి చెబుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో,కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న కరోనా పేషెంట్లను కూడా తాను ట్రీట్మెంట్ చేసి 12 గంటల్లో డిశ్ఛార్జి చేయించానని చెబుతున్నారు.
అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అని వారికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే,వారి సిబ్బందిలో 16 మందికి కరోనా రాలేదని ఆరోగ్యంగా ఉన్నారని కేవలం ఇద్దరు సిబ్బంది తన మెడిసిన్ వాడకపోవడం వల్ల కరోనా పాజిటివ్ బారినపడ్డారని చెప్పారు.
తన హోమియో మందుల గురించి ఎవరైనా పరిశోధించుకోవచ్చని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

About The Author