కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు…


కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్

కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదు

కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది

కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని పలుసార్లు కోరాం

కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ… ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు

ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది

కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది

కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు

కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారింది

అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదు

సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పాను

*జాతీయ మీడియా తో తెలంగాణా గవర్నర్ తమిళ సై*

About The Author