తిరుమలలో కిడ్నాప్ తీవ్ర కలకలం …


తిరుమలలో కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. సినిమా రేంజ్ లో తిరుమలలో కిడ్నాప్ కు పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. నెల్లూరుకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తి భార్యతో సహా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. దర్శనం ముగించుకొని సురాపురం తోట కాటేజ్ వద్ద ఉన్న హనుమంత రావును ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. భర్త కిడ్నాప్ కు గురి కావడంతో డయల్ 100కు కాల్ చేసి పిర్యాదు చేసి, భర్తను కిడ్నాప్ చేసిన కారు నెంబర్ తో సహా హనుమంత రావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. డయల్ 100 ద్వారా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేవలం 25 నిమిషాల్లో కేసును ఛేదించారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో తిరుపతి తిరుపతి పొలిమేరలు దాటకుండానే కిడ్నాప్ కు గురైన హనుమంత రావు తో పాటుగా కిడ్నాప్ కు పాల్పడ్డ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆర్థిక లావాదేవీలు కారణంగా హనుమంత రావును కిడ్నాప్ చేసినట్లు ధ్రువీకరించారు.

అనంతపురంలోని కియా మోటార్ సంస్థ ప్లాంట్ లో క్యాంటీన్ నడుపుతున్న హనుమంతరావు రూ.20లక్షలు మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజుల క్రితం పెనుగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి హనుమంత రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనంతపురం పోలీసులు అప్పటి నుంచి హనుమంతరావు అనంతపురం విడి అదృశ్యం కావడంతో పెనుగొండకి చెందిన శ్రీను, శ్రీకాళహస్తి నుంచి పెనుగొండలో సురేష్, కుమార్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసారని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తిరుమల టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
తమిళనాడులో మంత్రి పీఏ కిడ్నాప్
తమిళనాడులో మంత్రి పీఏను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసినట్టు మంత్రి పీఏ తర్వాత తెలిపాడు. తమిళనాడులోని పశు సంవర్థక శాఖ మంత్రి ఉడుమలై కే. రాధాకృష్ణన్ పర్సనల్ అసిస్టెంట్ కర్ణన్‌ను కొందరు దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలైపేటలోని ఎమ్మెల్యే ఆఫీసు వద్దే అతడ్ని నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే ఆఫీసు బయట ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం నలుగురు యువకులు ముఖానికి మాస్క్ లాంటిది కట్టుకున్నారు. ఓ కారులో వచ్చారు. కారును ఎమ్మెల్యే ఆఫీసు బయట ఉంచారు. ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యే ఆఫీసు లోపలికి వెళ్లారు. మరో యువకుడు కారు వద్దే ఉన్నాడు. లోపలికి వెళ్లిన ముగ్గురు యువకులు మంత్రి పీఏ కర్ణన్ ను కిడ్నాప్ చేసి బయటకు లాక్కొస్తున్న దృశ్యాలు ఉన్నాయి. అనంతరం అతడిని కారులోకి నెట్టారు. ఈ ఘటన ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. అయితే, కొన్ని గంటల్లోనే బాధితుడిని వదిలేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతడిని వదిలేసినట్టు తెలిసింది. కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టించుకుని వారు కర్ణన్‌ను వదిలిపెట్టారు. రాధాకృష్ణన్ కార్యాలయానికి 8 కిలోమీటర్ల దూరంలో పీఏను విడుదల చేశారు. అనంతరం కర్ణన్ స్పందిస్తూ… డబ్బు కోసం వారు తనని బెదిరించినట్లు తెలిపాడు. మూడు గొలుసులు, ఓ ఉంగరాన్ని తీసుకున్నారు. డబ్బు అడిగారు కానీ తాను పర్సు తీసుకెళ్లలేదన్నాడు. తన ఏటీఎం పిన్ నెంబర్ అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. కిడ్నాపర్లు ముసుగులు, టోపీలు ధరించిన కారణంగా గుర్తించలేదన్నారు. అయినప్పటికీ వారు స్థానికలుగానే పేర్కొన్నాడు.

About The Author