72 గంటల్లో 77 లక్షలు ! బ్యాంక్ దోపిడీ కేసును చేధించిన రూరల్ పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ

గుంటూరు;కొడితే కొండను కొట్టాలనే సామెతని…సమర్థవంతంగా అమలు చేసి బ్యాంక్ కే కన్నం వేశారు ఇద్దరు వ్యక్తులు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా ?అని యూట్యూబ్ వీడియోలు చూసి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకి చెందినఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్,వినయ్ రాములు దాచేపల్లిలోని ఎస్.బి.ఐ లో 77 లక్షలు దోచుకెళ్ళారు. జాగిలాలు గుర్తుపట్టకుండా పనిపూర్తైన తర్వాత పరిసరప్రాంతాల్లో కారం చల్లి వెళ్ళిపోయారు. దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులు పోలీసులకుఫిర్యాదుచేయడంతో..రూరల్పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దీంతోకేసునుచేధించడంలో ప్రతిభ కనబర్చిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించారు.

About The Author