శ్రీశైలంలో ప్రశ్నించినందుకే అర్చకులను కొట్టారు..!


_*ప్రశ్నించినందుకే అర్చకులను కొట్టారు..!*_

★ ఉచిత దర్శనానికి టికెట్ రుసుము ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఆలయ అర్చకులపై ఛైర్మన్‌ దాడి చేశాడు.

★ మరో ఇద్దరితో కలిసి కట్టెతో అర్చకులను చితక బాదాడు.

★ ఈ ఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగింది.

★ పూజాదికాలు నిర్వహించే అర్చకులపై సాక్షాత్తు ఆలయ ఛైర్మన్‌ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది.

★ బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో ఉచిత దర్శనానికి బదులు టికెట్ రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారని అర్చకులు సుధాకర్, చక్రపాణి ప్రశ్నించారు.

★ మీకు సంబంధం లేని వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహించిన ఆలయ ఛైర్మన్ ప్రతాప రెడ్డి కట్టెతో వీపుపై చితక బాదారు.

★ దాడి చేసిన వారిలో ఆలయ ఛైర్మన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారన్న అర్చకులు… కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

★ ఈ ఘటనపై ఆలయ ఈవో మోహన్‌కు అర్చకులు ఫిర్యాదు చేశారు.

About The Author