మధుమేహం – ఆహారనియమాలు .


మధుమేహం వంశపారంపర్యమైన వ్యాధి . తల్లితండ్రులిద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటే పిల్లలలో ఈ వ్యాధి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది. తల్లితండ్రులు ఇద్దరికి ఉంటే నూటికినూరుపాళ్లు పిల్లలకు వస్తుంది. కావున కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నచో మధుమేహం ముప్పు నుంచి కొంత తప్పించుకోవచ్చు. అవి

* తీపి పదార్దాలు తినకూడదు.

* మితాహార నియమాలు విధిగా పాటించాలి .

* శరీరం బరువు , లావు పరిమితికి మించకుండా చూసుకోవాలి .

* ప్రతినిత్యం వ్యాయాయం చేయాలి .

* మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి.

* కార్టిజోన్స్ , స్టెరాయిడ్స్ వాడరాదు.

* తరచుగా వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకుని సలహాలు తీసుకోవాలి .

పైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ రోగాన్ని దూరంగా ఉంచవచ్చు.

పాటించవలసిన ఆహారనియమాలు –

అన్నింటిలో మొదటిది క్రమబద్ధమైన నియమిత ఆహార సమయం . వరిఅన్నం తినేవారు గోధుమకు మారవలసిన అగత్యం లేదు . అన్నిరకాల తృణధాన్యాలలో 70 శాతం పిండిపదార్థాలు ఉండటం వలన ఈ మార్పిడి వలన ప్రయోజనం ఏమి లేదు . ఎవరి అలవాట్లకు వారు అణుగుణంగా వారు ఆహారం తీసుకోవచ్చు అయితే రోగి ఇంతకు పూర్వం తీసుకునే ఆహారపదార్థాల పరిమాణం మాత్రం ఈ వ్యాధి కారణంగా మార్చుకోవలసి ఉంటుంది.

ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గింజ ధాన్యాలతో అనగా మినుములు , పెసలు, శనగలు , కందులతో చేయబడిన ఆహారపదార్థాలు , పిండిపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి . వీటిలో తాలింపు పెట్టిన పెసలు , శనగలు లేక నానబెట్టి వాడేసిన పచ్చిశనగలు , పెసలు ఎక్కువుగా తీసుకోవాలి . రోజూ కనీసం ఒక్కసారైనా తీసుకోవటం మంచిది . పీచు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉపశమించటమే రక్తంలో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది . గింజధాన్యాలు , కాయగూరలు , ఆకుకూరలు పీచు బాగా కలిగి ఉంటాయి. శనగలు , పెసలు పైతొక్కతో సహా తినటం వలన ఈ విషయంలో మరింత సత్ఫలితం కలుగుతుంది . కాయగూరలు పరిమితి లేకుండా కాయగూరలు .

కాకరకాయ, చిక్కుడు, ఆనప , బీర, వంకాయ, క్యాబేజీ , కాలిఫ్లవర్ , గుమ్మడి , బూడిదగుమ్మడి , సిమ్లా మిరప, తెల్లముల్లంగి, పోట్ల, మునగ , తొటకూర, గొంగూర, చుక్కకూర , కొత్తిమీర , మునగాకు కూర, పాలకూర మొదలగు అన్ని రకాల ఆకుకూరలు , నీరుల్లి, టొమాటో , దొండ , బెండ, అరటిపువ్వు , అరటిదూట .

కొవ్వు పదార్దాలు ఎక్కువుగా ఉన్న నెయ్యి , వెన్న , కొబ్బరి నూనె , పామాయిల్ వాడరాదు. కొవ్వు తక్కువ ఉన్న పొద్దుతిరుగుడు గింజల నూనె , నువ్వులనూనె మితంగా వాడవచ్చు . ఆహారం తక్కువ పరిమాణంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి . లావుగా ఉన్నవారు రోజువారి కేలరీలను కూడా తగ్గించాలి. దుంపకూరలు వాడరాదు.

ఎట్టి పరిస్థితులలో చక్కెర , తేనె , గ్లూకోజ్ , బెల్లం , స్వీట్స్ , జీడిపప్పు , బాదం , లేతకొబ్బరి , మత్తుపానీయాలు , శీతలపానీయాలు , హార్లిక్స్ , బూస్ట్ వంటి పోషక విలువలు కలిగిన పానీయాలు అరటి , మామిడి, పనస , సపోటా మొదలగు పండ్లు తీసుకోరాదు . ఉపవాసాలు , నిరాహారదీక్షలు చేయరాదు . రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటే అవసరాన్ని బట్టి బత్తాయి, ఆపిల్ , పుచ్చకాయ, జామ , బొప్పాయి , ఉసిరి , కమలాఫలం తినవచ్చు .

ఆహార సమయాలు –

అల్పాహారం – ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు.

టొమాటో జ్యూస్ ఒక కప్పు , మొలకెత్తుచున్న గింజలు , రొట్టె లేక చపాతి , పలుచని పాలు పంచదార లేకుండా లేక రాగిమాల్ట్ .

మధ్యాహ్న భోజనం –

12 నుండి 1 గంట వరకు.

రాత్రి భోజనం –

6 గంటల నుండి 9 గంటల వరకు .

కలగూర, దోసకాయ, టొమాటో , ముల్లంగి , కాకరకాయ, చిక్కుడు మొదలయిన కూరగాయలు , ఉప్పు , మిరియపు పొడి , నిమ్మకాయ చాలా మంచిది . కూరగాయలు ఉడకపెట్టిన నీరు , గోధుమ అన్నం , గోధుమ రొట్టె , ఆకుకూరలు ముఖ్యంగా ములగ , అవిశ , మెంతికూరలు .

సాయంత్రం అల్పాహారం –

3 గంటల నుండి 5 గంటల వరకు

బొప్పాయి ముక్కలు లేక జామపండు, సాల్ట్ బిస్కేట్స్ , పలచని పాలు లేక రాగిమాల్ట్ పంచదార కలపకుండా వాడవచ్చు .

మామిడి, అరటి, పిండిపదార్థాలు , ఎక్కువ ఒకేసారి కడుపు నిండగా తినవద్దు.

About The Author