సామాజిక ఉద్యమ సేవా ఆధ్వర్యంలో కొంతమంది విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ..


సామాజిక ఉద్యమ సేవా కార్యకర్త జలగరి ఎ ట్టయ్య మదర్స్ డే సందర్భంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం (అమ్మ జలగారి లచ్చమ్మ, తండ్రి జలగరి చెన్నయ్య ) ఆధ్వర్యంలో కొంతమంది విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ చేశారు ….

పటాన్ చేరు పట్టణ పరిధిలోని సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త జలగరి ఎట్టయ్య తన నివాసంలో కొంతమంది విలేకరులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది, అనంతరం జలగారి ఎ ట్టయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వే లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు ఆశా వర్కర్లు పోలీసు వాళ్లు వీరు తమ ప్రాణాలకు తగ్గించి సేవ చేస్తూ ఉంటే వీరికి సపోర్టుగా విలేకరులు కష్టపడుతూ వీరు చేసిన సేవలు పేపర్ రూపంలో గానీ టీవీల రూపంలో గాని ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం వీరి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు ఈ మధ్య చాలామంది రిపోర్టర్లు కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరమని మదర్స్ డే సందర్భంగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నాకు తోచిన సహాయం గా కొంతమంది విలేఖర్లకు 25 కేజీల బియ్యం, 5 కిలోల మంచినూనె, చక్కెర ఇవ్వడం జరిగింది అని అన్నారు.. నియోజకవర్గంలో ఉన్న విలేకరులకు ఎప్పటికీ నా సపోర్ట్ ఉంటుందని అన్నారు

బైట్ ==జలగరీ ఎట్టయ్య సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త
రిపోర్టర్, కిట్టు, పఠాన్ చేరు

About The Author