హిందూపురం పట్టణంలో గుట్కా స్థావరాల పై పోలీసుల మెరుపు దాడి


అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాల మేరకు పెనుగొండ డిఎస్పి శ్రీ మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ సీఐ బాల మద్దిలేటి మరియు టు టౌన్ సిఐ మన్సూర్ వారు ఇరువురు బృందాలుగా ఏర్పడి హిందూపురం పట్టణంలో గుట్కా అమ్మే వారి పైన,గుట్కా సరఫరా చేసే వారి పైన, గోడౌన్ ల పైన మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అహ్మద్నగర్ హస్నాబాద్ mukkuidipeta రహమత్ పూర్, కోట ఏరియా ప్రాంతాలలో గుట్కా సరఫరా చేసే డీలర్లను ఆరు మందిని అదుపులోకి తీసుకొని వారిని అరెస్టు చేసి వారివద్ద సుమారు రూ. 1.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు.

About The Author