నారాయణమూర్తి: ఆ జివో జారీ చేసిన ఏపీ, సీఎం, గారికి సెల్యూట్

 

అనంతపురం: పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి సెల్యూట్‌ చేస్తున్నానని సినీ దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఎంతోమంది చిన్న నటీనటుల సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆ జీవో ఆశాకిరణంగా మారిందన్నారు.

గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆర్‌.నారాయణమూర్తి తాను నిర్మిస్తున్న ‘రైతన్న’ సినిమా విశేషాలను అక్కడి ప్రజలతోపంచుకున్నారు.

తాను నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్నట్లు తెలిపారు.

About The Author