ఎమ్మెల్యే భూమన కు కృతజ్ఞతలు తెలిపిన ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎన్ ఓ లు….

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి స్థానిక రుయా ఆసుపత్రి ఎఫ్ ఎన్ ఓ లు, ఎం ఎన్ ఓ లు గా  కృతజ్ఞతలు తెలిపారు.    రెండు వారాల కిందట వీరిని  విధుల నుంచి అధికారులు తొలగించగా…

భూమన కరుణాకర రెడ్డి అదేశాల మేరకు  బుధవారం యథావిధిగా  విధుల్లో కొనసాగించారు. ఈ సందర్భంగా బుధవారం పద్మావతి పురం లోని భూమన నివాసం వద్దకు చేరుకొని కృతజ్ఞతా పూర్వకంగా సత్కరించారు. వీధిన పడిన 41 కుటుంబాలను ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఆదుకున్నారని ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎన్ ఓ లు తెలిపారు.సీపీఎం నాయకులు కందారపు మురళి, నాగరాజు సహా  ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎం ఓ ల ప్రతినిధులు  పూర్ణిమ, వేదవతి, సుబ్రమణ్యం, విజయానందం, ప్రసాద్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు

About The Author