ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు…


కరోనా ఓమిక్రాన్ రూపం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా విసరిస్తోంది . భయపడాల్సిన అవసరం లేదు . బాగా చదివి అర్థం చేసుకొని పాటించండి .

ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు .
1 . జలుబు , గొంతు గరగర; ఒక్కో సారి దగ్గు . ఈ లక్షణాలు చాల మందిలో కనిపిస్తున్నాయి .

2 . జ్వరం .. కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తోంది . ఎక్కువ మందికి జ్వరం రావడం లేదు . కొంతమందికి మాత్రం ఒక రోజు లేదా రెండు రోజులు జ్వరం వస్తోంది . కొంతమందిలో జ్వరం ఎక్కువగా అంటే 103 డిగ్రీ ల దాక వచ్చి తగ్గిపోతోంది . జ్వరం 102 దాటితే ఒంటిని ని తడిబట్ట తో తుడవండి. దీన్ని స్పాంజింగ్ అంటారు

3 . తక్కువ మందిలో కడుపు నొప్పి , వాంతులు .. ముఖ్యంగా ఇరవై ఏళ్ళు లోపు వారిలో ఇది కనిపిస్తోంది . వాంతులు అవుతున్నప్పుడు మజ్జిగ కొబ్బరి నీరు లాంటివి బాగా తాగాలి . వాంతులు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి

4 . వొళ్ళు నొప్పులు , కాళ్ళు లాగినట్టు ఉండడం . నీరసం .

చేయాల్సినవి :

1 పై లక్షణాలు కనిపిస్తే బి, సి , డి విటమిన్ మాత్రలు, జింక్ మాత్ర వారం పాటు తీసుకోండి . జ్వరం వున్నప్పుడు మాత్రం పారాసెటమాల్ 500 మాత్ర తీసుకోండి . పారాసెటమాల్ అదే పనిగా తినొద్దు . పదేళ్ల లోపు పిల్లలకు విటమిన్ మాత్రలకు బదులుగా మల్టీ విటమిన్ సిరప్ ఇవ్వండి . ఇవి కాకుండా మరే ఇతర మాత్రలు వద్దు . అంటి బయటిక్ మాత్రలు అవసరం లేదు . మాల్పురంవీర్ అనే మాత్రలు కొంతమంది తీసుకొంటున్నారు . ఇవి తీసుకొంటే కాన్సర్ వచ్చే ప్రమాదం వుంది అని icmr హెచ్చరించింది . జాగ్రత్త . అది తింటే పిల్లలు పుట్టరు.

2 . వేడి నీరు తాగాలి . పెద్దలు రోజుకు నాలుగు లీటర్లు . పిలల్లు రెండు లీటర్లు . గొంతు లో గరగర /దగ్గు పోవడానికి వేడి నీటిలో ఉప్పు వేసి తల పైకెత్తి బాగా గొంతులో తిప్పి మూసేయండి . జలుబు , దగ్గు చాల మందిలో రెండు రోజుల్లో తగ్గిపోతోంది . నాలుగైదు రోజులు దగ్గు తుమ్ములు వున్నా భయపడాల్సింది ఏమీ లేదు .

4 . నాన పెట్టిన బాదాం రెండు , షుగర్ లేని వారు రోజుకు ఒక అరటి పండుతినాలి . అందరూ పాలకూర , తోట కూర , అల్లం వెల్లులి కనీసం వారం తినాలి . వీటిని మీకు తోచిన రీతిలో వండుకోండి. ఇది మన ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేస్తుంది .

5 . అల్లం పసుపు కషాయం రోజుకు ఒక సారి కేవలం మూడు రోజులు టీ లాగా తాగండి . ఎక్కువ తాగొద్దు . వాంతులు అయ్యేవారికి కషాయం వద్దు

ఇప్పుడు విసరిస్తున్నది ఓమిక్రాన్ . కానీ అక్కడక్కడా డెల్టా కూడా వ్యాపిస్తోంది . మనకు సోకింది డెల్టా నా ఓమిక్రాన్ నా అని తెలిసే అవకాశం లేదు .చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలి అంటారు . కాబట్టి అందరూ పల్స్ ఆక్సీమేటర్ తో చెక్ చేసుకోండి . అందులో sp ౦ 2 .. 94 అంతకంటే ఎక్కువ ఉంటే సమస్యే లేదు . లేచి కూర్చుని చెక్ చేసుకోండి . పడుకొని , కిటికీలు మూసి చెక్ చేస్తే ఒక్కో సారి 93 లేదా 92 రావొచ్చు . గాబరా పడొద్దు . వేలు పెట్టిన ముప్పై సెకండ్స్ కు వచ్చే రీడింగ్ చూడాలి . ముందుగా ఎంత వుంది అనేది లెక్కలోకి తీసుకోవద్దు . 91 కంటే రీడింగ్ తక్కువ ఉంటే సోకింది డెల్టా అది ఊపిరి తిత్తుల్ని దెబ్బ తీస్తోంది అని అర్థం చేసుకోవాలి . ఇప్పటికే కరోనా ఈ మూడో వేవ్ లో లక్షలాది మందికి సోకింది . ఎవరికీ ఇలాంటి అవసరం రాలేదు . ముందు జాగ్రత్త గా చెప్పాను. కంగారు పడొద్దు .

డెల్టా సోకితే అయిదవ రోజుకు రుచి లేదా వాసన లేదా రెండు పోతుంది . ఆలా వాసన రుచి పోలేదంటే అది ఓమిక్రాన్ అని అర్థం . రుచి వాసన పొతే నువ్వుల లడ్డు రోజుకు ఒకటి పది రోజులు తినండి . పోయిన రుచి వాసన తిరిగి వచ్చేస్తాయి . కాస్త ఆలస్యం అయితే కంగారొద్దు .

ఓమిక్రాన్ సోకిన నూటికి తొంబై మందిలో ఎలాంటి లక్షణాలు కనపడడం లేదు . లక్షణాలు ఉన్నా అవి రెండు మూడు రోజుల్లో పోతున్నాయి . కాబట్టి భయం అసలు వద్దు . ఇప్పుడు సోకుతున్న వారిలో నూటికి తొంబై తొమ్మిది ఓమిక్రాన్ . డెల్టా ఎక్కడో ఒక చోట కనిపిస్తోంది .

మనకు సోకింది కరోనా కదా అని తెలుసుకోవాలనే ఆసక్తి భయం వద్దు . ఆర్టీపిసిఆర్ యాంటిజెన్ లాంటి టెస్ట్ ల వద్దు . వైరస్ రెండు రోజుల్లో చనిపోతుంది . టెస్ట్ కు వెళ్లే లోపే పోతుంది . కాబట్టే దక్షిణాఫ్రికా స్పెయిన్ లాంటియూ అనేక దేశాలు అసలు టెస్ట్ లు అవసరం లేదని చెప్పాయి . కొంత మంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటున్నారు . అక్కడ పాజిటివ్ అని తేలితే కొన్ని ఆసుపత్రులు డి దిమ్మెర్ CRP , బ్లడ్ టెస్ట్ అంటూ ఒక డజను టెస్ట్ లు చేయమని అడుగుతున్నారు . ఓమిక్రాన్ కోసం ఇలాంటి టెస్ట్ లు ఏవీ అవసరం లేదు. ఇది నా మాట కాదు . దేశం లోని ప్రముఖ డాక్టర్ లు నిన్న ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేసారు . రెండో వేవ్ సందర్భంగా రోగులకు స్టెరాయిడ్ లాంటివి ఇచ్చి ఆరోగ్యాన్ని చెడగొట్టారు . ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి . వీటిని అరికట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు . కాబట్టి జాగ్రత్త . చికిత్స పేరుతొ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు .

ఓమిక్రాన్ సోకి ఇంట్లో ఉంటే రెండు రోజుల్లో తగ్గిపోతుంది . అనవసర టెస్ట్ లు .. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే మందులు తిని ఆరోగ్యాన్ని చెడకొట్టుకోవద్దు . డబ్బు ఎక్కువైతే ఉద్యోగం పోగొట్టుకొని బాధ పడుతున్నవారికి విరాళం ఇవ్వండి . పిచ్చి టెస్ట్ ల తో పిచ్చి మాత్రలతో ఇంటిని ఒంటిని గుల్ల చేసుకోవద్దు .

ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళాలి ?

1 . జ్వరం ఆరో రోజుకు కూడా తగ్గక పొతే . 2 . పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం 94 నుంచి తగ్గడం మొదలై 91 చేరుకున్నప్పుడు అంబులెన్సు పిలవాలి . అప్పుడు ఆలస్యం వద్దు . ఇలాంటి అవసరం ఈ మూడ్ వేవ్ లో ఎవరికీ రాలేదు .

పల్స్ ఆక్సీమేటర్ లో SPO2 కాకుండా మరొక రీడింగ్ వస్తుంది . చూసారా ? అది వంద లోపు ఉంటే మీ ఉంట్లో నిలకడ ఉన్నట్టు జ్వరం వల్ల ఒంట్లో నిలకడ ఉంటే అది 120 -130 దాకా ఉంటుంది . కంగారొద్దు . అదేమీ డేంజర్ కాదు . అయ్యో పల్స్ రీడింగ్ ఎక్కువ వుంది . వందకు తగ్గాలి అని మీరు కంగారు పడితే అది టెన్సన్ వల్ల పెరుగుతుంది . లైట్ గా తీసుకోండి . సాధారణంగా వైరస్ సోకి లక్షణాలు వున్నప్పుడు అంటే తొలి రెండు మూడు రోజులు అది వందకు పైన ఉంటుంది . వైరస్ చచ్చి మీరు ఆరోగ్యం కుదుటపడుతుంటే అది వంద అంతకంటే తక్కువ యిపోతుంది . మీకు ఇదివరకే బిపి ఉంటే ఇది ఎక్కువగా ఉంటుంది . దాన్ని గురించి భయం వద్దు .

ఓమిక్రాన్ సోకితే ఇప్పుడు కోలుకొన్నా దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది అనే ప్రచారాన్ని నమ్మకండి. అది మిమల్ని భయపెట్టాలని దురుద్దేశం తో చేసే భూటకపు ప్రచారం.

ఈ మెసేజ్ ని అందరితో షేర్ చేసుకోండి .

About The Author