ప్రోటోకాల్ పాటించని కృష్ణ జిల్లా అధికారులు…


కృష్ణా జిల్లాలో ప్రోటోకాల్ తారుమారు…!!

ఒక రాజ్య సభ సభ్యుడిని ఒక జిల్లా అధికారి ప్రభుత్వ నిబంధనల (ప్రోటోకాల్) ప్రకారం కలవాలి…

కాకపోతే ఇక్కడ అంత సీన్ రివర్స్…

రాజ్య సభ సభ్యులు జిల్లా అధికారి కి అర్జీ ఇవ్వడం పట్ల కృష్ణా జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

కూటమి నేతల అందరినీ సమానత్వంగా జిల్లా అధికారులు చూడలేకపోతున్నారా…!!

స్థానికంగా బలమైన పార్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారా…??

కేంద్ర పార్టీ నాయకులతో మాకేం ఉందిలే అని అధికారులు భావిస్తున్నారా…!!

రాష్ట్ర ప్రభుత్వ నాయకులతోనే మాకు ముఖ్యం అనుకుని జిల్లా అధికారులు సమర్ధించుకుంటున్నారా…!!

లేక ఎప్పటిలాగా జిల్లా అధికారులు టేక్ లైట్ అనే పద్ధతిలో కొనసాగుతున్నారా…!!

అధికారుల సంగతి ఐతే సరేసరి…

మరి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏమైంది…??

జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు…

కృష్ణా జిల్లా బిజెపి నాయకులు కూడా రాజ్య సభ సభ్యుడి కి జిల్లా అధికారులతో సరైన ప్రోటోకాల్ ఇప్పించాలనే ఆలోచన కూడా రాలేదా…

కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ లో అవగాహన లోపమా…!!

రాజ్య సభ సభ్యుడితో జిల్లా అధికారి కి అర్జీ ఇప్పించడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది…

జిల్లా అధికారులను ఆదేశించాల్సిన రాజ్య సభ సభ్యుడితోనే జిల్లా అధికారులకు అర్జీ ఇప్పించిన ఘనత కృష్ణా జిల్లా బీజేపీ నాయకులకే దక్కింది…

కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీలో నాయకుల తీరు ఇదే విధంగా ఉంటే మున్ముందు ఇంకెన్ని ఘటలను చూడవలసివస్తుందో…??

About The Author