JCA యూనియన్ , మరియు హౌసింగ్ సొసైటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు

తిరుమల, 2026 జూలై,12 వ తేదీ తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ బి ఆర్ నాయుడు గారిని తితిదే ఉద్యోగ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సమావేశంలోటీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారు తితిదే ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలకు JCA యూనియన్ , మరియు హౌసింగ్ సొసైటీ తరపున అధ్యక్షులు శ్రీ గంపల వెంకటరమణ రెడ్డి, కల్పన, LNV రవికుమార్ ,సుబ్రహ్మణ్యం (భుట్టో) , గోల్కొండ వెంకటేశం, రామచంద్ర , రాజ్ కుమార్, ఇందిర, ఆదిలక్ష్మి మరియు వివిధ సంఘాల నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఈ క్రింది తెలియజేసిన విషయాలు మాట్లాడటం జరిగింది.

ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి డిపెండెంట్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపుకు సుమారు రూ.14 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

టీటీడీ ఉద్యోగుల హౌస్ ప్లాట్ల అభివృద్ధి కోసం సబ్ కమిటీ సిఫార్సులను రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ గారు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

టీటీడీ ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య అందించే అంశంపై కూడా చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి, త్వరలో అమలు దిశగా చర్యలు చేపడతామని తెలిపారు.

” ఈ ఉచిత విద్య వలన తితిదే ఉద్యోగుల పిల్లలకు చాలా మంచి చేకూరుతుంది ”

మన తితిదే లో 1060 అమైండ్మెంట్ జరగాల్సి ఉంది. సదరు విషయం సంబంధించిన దస్త్రం తితిదే పరిషత్ విభాగం లో ఉంది.

సదరు విషయం పై పరిషత్ విభాగం వారు తితిదే ఉద్యోగ సంఘాల, వారితో సమావేశం ఏర్పాటు చేయవలసి ఉంది..

ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనను తన ముందుకు తీసుకువచ్చి ఉద్యోగులకు ఉపయోగపడేలా చేసిన గౌరవనీయులైన టీటీడీ ఈ.ఓ. శ్రీ ముద్దాడ రవిచంద్ర ఐఎఎస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పడం జరిగింది.

ఇట్లు

జాయింట్ కౌన్సిల్ అసోసియేషన్ (JCA)

టీటీడీ హౌస్ ప్లాట్స్ కమిటీ సభ్యులు & టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు

About The Author