గోల్కొండ బోనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ జూలై 16, 2026: గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి (ఎల్లమ్మ తల్లి) బోనాల ఉత్సవాల సందర్భంగా నగర పోలీసులు జూలై 16, 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
రాందేవ్గూడ, లంగర్ హౌస్, షేక్పేట్, నార్సింగి, సన్సిటీ తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు వచ్చే వాహనాలను మక్కాయ్ దర్వాజా, ఫతే దర్వాజా, బంజారా దర్వాజా మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫిలింనగర్, గచ్చిబౌలి, షేక్పేట్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ను బాలికా భవన్, నానల్నగర్ తదితర మార్గాల వైపు డైవర్ట్ చేయనున్నారు.
బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రాందేవ్గూడ, లంగర్ హౌస్, షేక్పేట్ వైపుల నుంచి వచ్చే వాహనాలకు ఆర్మీ సెంటర్, హుడా పార్క్, ఓవైసీ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, ఏరియా హాస్పిటల్, సెవెన్ టూంబ్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
పార్కింగ్ ప్రాంతాలను సులభంగా గుర్తించేందుకు మార్గమధ్యంలోని సైన్బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్కు సంబంధించిన సమాచారం కోసం 9010203626 హెల్ప్లైన్ను సంప్రదించాలని తెలిపారు.
