దూర్వాగణపతి వ్రతం…

దూర్వాగణపతి వ్రతం- :

విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ” గరిక (గడ్డి) ” పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము . గరికతో పూజి్స్తాం గనుక ఈ స్వావిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు . ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచల తో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది .

యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి . అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరము లో అమితమైన వేడి పుట్టింది . దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను , అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది . నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …. అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను . సంస్కృతము లో గరికను ” దూర్వలం ” అంటారు . శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది .

శ్రావణమాసం లో వచ్చే బహుళ చతుర్ధి గణపతి కి అత్యంత ప్రీతికరమైన రోజు . ఈ రోజున సంకష్టహర చతుర్ధీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం . ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి. దూర్వా గణపతి వ్రతంనాడు స్వామిని 21 రకాల గరికతో పూజించడం వలనే ‘దూర్వా గణపతి’ అంటారు.
ఈ వ్రత విధానంలో 21 నామాలతో వినాయకుణ్ణి అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.

ఓం గజననాయ నమః
ఓం గణపతయే నమః
ఓం హేరంబాయ నమః
ఓం ధరణీ ధరాయ నమః
ఓం మహా గణపతయా నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం క్షిప్రప్రసాదనాయ నమః
ఓం అమోఘ సిద్దియే నమః
ఓం అమితాయ నమః
ఓం మంత్రాయ నమః
ఓం చింతామణయే నమః
ఓం నిధయే నమః
ఓం సుమంగళాయ నమః
ఓం బీజాయ నమః
ఓం ఆశాపూరకాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శివాయ నమః
ఓం శాక్యపాయ నమః
ఓం పార్వతీనందాయ నమః
ఓం వాక్యతయే నమః
ఓం ఢుంఢి వినాయకాయ నమః
దూర్వా గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖసౌఖ్యాలు.. శుభాలు కలుగును .

About The Author