కాశీ లో తీవ్ర అస్వస్థతతో కుప్పకూలిన మురళీమోహన్‌ను పరామర్శించిన మెగాస్టార్‌…

టాలీవుడ​ సీనియర్‌ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. తాజాగా మురళీమోహన్‌కు శస్త్ర చికిత్స జరగడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేర్‌ ఆసుపత్రి బృందం వెన్నుముకకు సంబంధించిన ఈ చికిత్సను ఎంతో జాగ్రత్తగా అందించిందని, తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మురళీమోహన్‌ను చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

కేర్ లో వెన్నుపూస శస్త్రచికిత్స…

తన తల్లి అస్థికల నిమజ్జనం కోసం కాశీ వెళ్ళిన మురళీమోహన్, వెన్నెముక సంబంధిత సమస్యతో కుప్పకూలారు… హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా… వెనువెంటనే శస్త్రచికిత్స చేసారు అక్కడి వైద్యులు… ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వీలైనంత తొందరలో రాజమండ్రి వచ్చి కలుస్తానంటూ వీడియో విడుదల చేసారు మురళీమోహన్. శస్త్రచికిత్స అనంతరం డిస్చార్జ్ అయిన మురళీమోహన్ ను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు.

About The Author