ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందా..?

హైదరాబాద్‌: పశు వైద్యురాలు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దోషులను శిక్షించకుండా.. మనం RIP అని చెప్పినంత మాత్రాన ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందా అని నాని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

ఇప్పటివరకూ దోషులెవరో గుర్తించకుండా వారిని శిక్షించి, న్యాయం చేయమని ఏవిధంగా డిమాండ్‌ చేయగలం. దోషులను శిక్షించకుండా RIP అని చెప్పినంత మాత్రాన ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందా..? చాలా కోపంగా, నిస్సహాయంగా ఫీల్‌ అవుతున్నాను. మీడియా వారు సంయమనం పాటించాలని కోరుతున్నాను’ అని నాని పేర్కొన్నారు.

About The Author