తల్లి బాధను కూతురు కన్నీటితో టిక్ టాక్ లో పెట్టింది.. ..


తల్లి బాధను కూతురు కన్నీటితో టిక్ టాక్ లో పెట్టింది.. ..
స్పందించిన సీఎం.. మందులు పంపించారు..
బెళగావి జిల్లాలోని రాయదుర్గ తాలూకాలోని నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళకు రెండి కిడ్నీలు దెబ్బతినడంతో భర్త ఒక కిడ్నీ దానం చేయగా ఆమెకు అమర్చారు. జనవరిలో ఆపరేషన్‌ జరగ్గా, ఇంట్లో మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటోంది. 20 రోజుల నుంచి లాక్‌డౌన్‌ వల్ల ఆమెకు కావాలసిన మందులు దొరకడం లేదు.
ఫలితంగా రోజురోజుకూ నీరసించి ఆరోగ్యం విషమిస్తోంది. దీంతో కూతురు పవిత్ర తన తల్లి బాధను వివరిస్తూ టిక్‌టాక్‌ వీడియో చేసింది. దీంతో సీఎం యడియూరప్ప సూచన మేరకు జిల్లా అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు.

About The Author