మృత కానిస్టేబుల్ కుటుంబానికి సహచర కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం


జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రూ.5,85,000/ అందజేత

జిల్లాలో ఇటీవల మృతి చెందిన కానిస్ఠేబుల్ కుటుంబానికి సహచర పోలీస్ కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు చేతుల మీదుగా రూ. 5,85,000/ లు మృతుడి భార్య పూజకు అందజేశారు. వివరాలు… 2013 బ్యాచ్ కు చెందిన గుంతకల్లు టూటౌన్ పోలీసు కానిస్టేబుల్ టి.మధుసూదననాయుడు ( పి.సి నంబర్ 159) గత నెల 13 వ తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. మృతుడి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహకారమందించాలని సంకల్పించి 2013 కు చెందిన సహచర బ్యాచ్ మేట్స్ రూ. 4.65 లక్షలు…మరియు 2009 బ్యాచ్ కానిస్టేబుళ్లు రూ. 1.20 లక్షల మొత్తాన్ని పోగు చేశారు. ఈ నగదును జిల్లా ఎస్పీ తన చేతుల మీదుగా మొత్తాలను నగదు, చెక్కు రూపంలో టి.మధుసూదననాయుడి భార్య పూజకు అందజేశారు. ఈసందర్భంగా మృతుడి కుటుంబం గురించి ఎస్పీ ఆరా తీశారు. పిల్లలు, కుటుంబ అభివృద్ధి కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రయోజనాలన్నీ సకాలంలోనే అందజేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, 2013 & 2009 బ్యాచ్ లకు చెందిన కానిస్టేబుళ్లు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About The Author