వృద్ధ తల్లిని రోడ్డుపై వదిలేసిన అపరిచితులు..ఆదుకున్న అధికారులు..హాస్పటల్ కి తరలింపు…


మచిలీపట్నం :

స్థానిక ఇంగ్లీష్ పాలెం చర్మశిల్ప సెంటర్ నందు సుమారు 85 సంవత్సరాల మతిస్థిమితం లేని వృద్ధురాలిని ఎవరో అపరచితులు వృద్ధురాలిని రోడ్డు పై వదిలి వెళ్ళారు.
ఈ వృద్ధురాలు హనుమాన్ జంక్షన్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఆర్డీఓ ఖాజావలి గారి దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన ఆర్డీఓ గారు వృద్ధాశ్రమాల సూపరింటెండెంట్ గారిని, రెవెన్యూ R I గారిని హుటాహుటిన పంపి వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి చేరేలా కృషి చేసారు.విషయం తెలుసుకున్న చిలకలపూడి C I వెంకటనారాయణ గారు తన సిబ్బందిని పంపి వృద్ధురాలి వివరాలను సేకరిస్తున్నారు.

About The Author