నాడు నేడు రేపు ఎన్ఆర్ఐలు కేసిఆర్ వెంటే…


టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి
నాడు ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అలాగే రేపు జరగపోయే అభివృద్దిలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ లు కేసిఆర్ వెంటే ఉన్నారు, ఉంటారని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. నాటి నుండి నేటి వరకు కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను అస్థిర పరిచేందుకు ఎన్నో శక్తులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయని వీరి కుట్రలకు, కుతంత్రాలకు ఏనాడు తల్లోగ్గబోమని , మా ఆత్మ గౌరవం , ఆత్మాభిమానం కాపాడే నాయకుడు కేసీఆర్ ఒక్కడే నని , విదేశాలలో ఈరోజు మాకంటు ఒక గుర్తింపుతో ఉన్నామంటే అది కేసిఆర్ చలవే అని కాసర్ల తెలిపారు. పెడితే పెళ్లి లేకపోతే చావు కోరే కొంత మంది మాత్రమే ఎన్నడూ లేని తమ విష పూరిత ప్రేమను టీఆర్ఎస్ బర్తరఫ్ నేతలపై చూపుతున్నారని కాసర్ల ఎద్దేవా చేశారు. ఈటెల నేడు ప్రదర్శించేది ధర్మాగ్రహమే అయితే…. ఇన్నేళ్ల సావాసంలొ ఎందుకు ఈ ధర్మాగ్రహన్ని ప్రదర్శించలేదనీ, కొత్త జెండాలు మోయటానికి, జిందాబాద్ లు కొట్టడానికి, కాబోయే సీఎం అని అరవడానికి కొంత మంది ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని, కానీ వాళ్లంతా నిజమైన కార్యకర్తలు కాదన్నది గుర్తించాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు.

About The Author