జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం….


ఆ పరమశివుని పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం ….

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.

జ్యోతిర్లింగాలు అంటే శివుని పవిత్రమైన స్వరూపాలు. ఇవి భారతదేశంలో 12 ప్రదేశాలలో వెలసి ఉన్నాయి. ఇవి శివుని లింగ రూపంలో ఆరాధించే ప్రదేశాలు.
జ్యోతిర్లింగాలు మరియు అవి ఉన్న ప్రదేశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..

జ్యోతిర్లింగాలు ఎన్ని.?

1. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం..

2. ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం..

3. మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..

4. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం..

5. జార్ఖండ్ రాష్ట్రంలో వైజనాథ్ జ్యోతిర్లింగం..

6. మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగం..

7. తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగం.

8. గుజరాత్లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం..

9. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం..

10. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం..

11. ఉత్తరాఖండ్ లోని కేదారేశ్వర జ్యోతిర్లింగం..

12. మహారాష్ట్రలోని ఘృష్లేశ్వర జ్యోతిర్లింగం..

1. సోమనాథ్:
గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి.

2. మల్లికార్జున:
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది. ఇది శివుడు, పార్వతి కొలువైన శక్తివంతమైన పుణ్యక్షేత్రం.

3. మహాకాళేశ్వర:
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ మహాకాళేశ్వరుడు భస్మహారతితో పూజలు అందుకుంటాడు.

4. ఓంకారేశ్వర:
మధ్యప్రదేశ్ లోని మాంధాతా ద్వీపంలో ఉంది. ఇది నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర ప్రదేశం.

5. వైద్యనాథ్:
జార్ఖండ్ లోని దేవఘర్ లో ఉంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడు కొలువై ఉన్నాడు.

6. భీమశంకర్:
మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉంది. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉంది.

7. రామేశ్వరం:
తమిళనాడులో ఉంది. ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం.

8. నాగేశ్వర:
గుజరాత్ లోని ద్వారక సమీపంలో ఉంది. ఇక్కడ నాగేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు.

9. విశ్వేశ్వర:
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఇది కాశీ విశ్వనాథుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

10. త్రయంబకేశ్వర:
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. ఇక్కడ త్రయంబకేశ్వరుడు కొలువై ఉన్నాడు.

11. కేదారేశ్వరుడు :
ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది హిమాలయ పర్వతాలలో ఉంది. ఇక్కడ కేదారేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు.

12. ఘృష్ణేశ్వర:
మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. ఇక్కడ ఘృష్ణేశ్వరుడు వెలసి ఉన్నాడు.

ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం

సోమనాథ జ్యోతిర్లింగం::

సౌరాష్ట్ర దేశంలో చంద్రుని చేత నిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

మల్లిఖార్జున జ్యోతిర్లింగం :

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ::

ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం :

అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

కేదారేశ్వర జ్యోతిర్లింగం :

శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

భీమశంకర జ్యోతిర్లింగం :

ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

విశ్వేశ్వర జ్యోతిర్లింగం :

సర్వప్రపంచం చేతా సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన
మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం :

మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

వైద్యనాథ జ్యోతిర్లింగం :

చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

నాగేశ్వర జ్యోతిర్లింగం :

ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

రామేశ్వర జ్యోతిర్లింగం :

శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం
చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

ఘృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగం :

‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

????️ ఓం నమశ్శివాయ ||

|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||

About The Author