ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు.వైఎస్ షర్మిలా రెడ్డి
– యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు.
– రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు…రైతుల పంట పండేదెన్నడు ?
– యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ?
– యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు.
– యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్ కి కారణం అవుతున్నారని,
– రాష్ట్రంలో టాప్ 5 లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాలని,
– యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని,
– అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదం.
– రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసింది.
– ధాన్యాగారానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్ర రైతులకు వ్యవసాయం మీద నీతులు నేర్పడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం.
– యూరియా ఎక్కువ చల్లి రైతులు పండించే బియ్యం తినడానికి పనికిరావనడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లే.
– ఖరీఫ్ సీజన్ లో 14 లక్షల హెక్టార్లలో వరి సాగువుతుంటే ఎంత యూరియా అవసరమో తెలియదా ?
– రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతల అగచాట్లు కనిపించడం లేదా ?
– రాష్ట్రానికి రావలసిన యూరియా 6.65 లక్షల మెట్రిక్ టన్నుల కోటాలో ఇంకా లక్ష టన్నులు ఇవ్వకుండా కేంద్రం చోద్యం చూస్తుంటే ..
– మోడీ గారిని నిలదీసే దమ్ములేని మీరు రైతులదే తప్పు అన్నట్లు మాట్లాడటం నిజంగా బాధాకరం.
– ఉచిత సలహాలు పక్కన పెట్టి తక్షణం రాష్ట్ర రైతులకు సరిపడా యూరియా అందించండి.
– ఆ తర్వాత చేపట్టే సంస్కరణల మీద అవగాహన కల్పించండి.