మంత్రి వర్గ ఏర్పాటుకు సర్వం సిద్ధం…

**** మంత్రి వర్గ ఏర్పాటుకు సర్వం సిద్ధం… ****

తెలంగాణలో టీఆరెస్ పార్టీ రెండసారి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత మొదటి సారిగా రేపు మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది…

ఈ నేపథ్యంలోనే రేపు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఉదయం 11.30 నిమిషాలకు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు…

ఇప్పటికే సీఎం కేసీఆర్ పది మంది ఎమ్మెల్యేలను తన మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్టు సమాచారం…

కానీ ఎవరి ఏ శాఖను కేటాయిస్తారు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది…

ఇక ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రాజ్ భవన్ లో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు…

ఇప్పటికే పలువురికి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందాయి…

కార్యక్రమానికి వచ్చే అతిథిలు వారికి వచ్చిన ఆహ్వాన పత్రికతో కార్యక్రమ ప్రారంభం కంటే అరగంట ముందే రాజ్ భవన్ కు రావాల్సిందిగా పేర్కొన్నారు…

ఇక ఒక్క ఆహ్వాన పత్రికకు ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుందని, వచ్చిన ఆహ్వాన పత్రిక ఇతరులకు బదిలీ చేయరాదని తెలిపారు…

About The Author