తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ…

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ శ్రీ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో శ్రీ ఈటల రాజేందర్‌, శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ జగదీష్‌ రెడ్డి, శ్రీ ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీ శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీ సీహెచ్‌ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్‌, శ్రీ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ శ్రీ స్వామిగౌడ్, హోంమంత్రి శ్రీ మహముద్ అలీ మరియు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Hon’ble Governor Sri ESL. Narasimhan administered the oath of office and secrecy to the Ministers at a ceremony held at Raj Bhavan today in the august presence of Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao.

About The Author