సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు…


సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఒకవేళ కేసీఆర్‌ అనుకూల ప్రభుత్వం ఎపిలో అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని, రాజధాని సైతం తరలిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అంశంపై ‘నిజం విత్‌ శివాజీ’ పేరుతో ఇవాళ ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఎపి అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో జగన్ స్నేహం పులిమీద స్వారీ లాంటిదన్న శివాజీ.. అలాంటి స్నేహం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను శివాజీ ప్రదర్శించారు.

రాజకీయ పార్టీల తరఫున కాకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నానన్న ఆయన.. ప్రశ్నించే వాడికి కులం అంటగ‌డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌ అని జగన్‌ వ్యాఖ్యానించడంపై శివాజీ అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జగన్‌ ఇంటికే మూడున్నరేళ్లు పడితే ఇంతపెద్ద రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పట్టదా? అని ప్రశ్నించారు.

About The Author