అనంతపురం జిల్లా నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఈవీఎంను పగులగొట్టారు…


అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఈవీఎంను పగులగొట్టారు. గుత్తి బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడకు వచ్చిన జనసేన అభ్యర్థి మదుసూదన్‌ గుప్తా.. ఓటింగ్‌ ఛాంబర్‌లో శాసనసభ, పార్లమెంట్‌ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్ది చెప్పడానికి అధికారులు ప్రయత్నించినా వినని గుప్తా.. వెంటనే అక్కడున్న ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. ఆయనను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

About The Author