యజ్ఞం ఎందుకు చేస్తారు..?


మనందరికీ యజ్ఞం అనే పదం బాగా తెలిసిందే. దేవాలయాల్లో, కొత్త ఇళ్ళలో, ఇంకా చాలా సందర్భాలలో యజ్ఞాలు చేస్తుంటారు. అయితే ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారో? వాటి వల్ల ఫలితాలేంటొ తెలుసుకుందాం.

వేదకాలం నాటి నుండి ఉన్న మన ఆచార వ్యవహారాలెన్నో నేడు అంతర్థానమైపోయాయి. మరికొన్నిఅయితే పూర్తి వ్యతిరేక స్థాయిలో అమల్లోకి వచ్చాయి. కొన్ని రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకున్నాయి. అలాంటి వాటిలో యజ్ఞయాగాదులను ముఖ్యమని చెప్ప వచ్చు. ఈరోజుల్లో అధికారం కోసం, దాన్ని నిలబెట్టుకోవడానికే యజ్ఞాలను చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది మరి.

యజ్ఞం లేదా యాగం అనేది ఒక విశిష్టమైన మన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం ముఖ్య లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవన్ని అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి వాటిని వేస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చు. ‘‘ యజ్ఞం ’’ అను శబ్దం ‘‘ యజ దేవపూజయాం’’ అనుదాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. ’’యజయే ఇతి యజ్ఞ: యజ:’’ ఎన్నో యజ్ఞ యాగదులచేత యోగ దాయకుడైన పరమేశ్శరుని యోగీశ్యరత్వానికి ’య’ కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వలన స్వార్దం నశింస్తుందని గాఢ విశ్వాసం ఉంది.

యజ్ఞాలు ల లో మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు

వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అంటే యజ్ఞము విష్ణు స్వరూపం అని అర్ధం.

.
చాలామంది హోమం, అగ్నిహోత్రాల్లో ఆజ్యం (నునె లేదా నెయ్యి) పోయడం దండగని, మిగతా వస్తువులన్నీ వేయడం వృధా అని, చాదస్తం అని కొట్టి పడేసేవారున్నారు, దీనివల్ల ఒరిగేదేమీ లేకపోగా ఎంతో డబ్బు నష్టమని కొందరు వాదిస్తూ ఉంటారు. ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్వార్థం కోసమే కాదు కదా! కొన్నిటిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఆయా వస్తువులు, పదార్ధాలను వృధా చేసినట్లనుకుంటే పొరపాటే మరి. ఆయా పదార్ధాలను కచితంగా సార్ధకం అవుతుంది. ఇలా అగ్నిదేవునికి ఆహుతి చేయడంవల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది అనేది మనకు అనాదిగా వస్తున్నా నమ్మకం.

ఈ యజ్ఞాలు చెయ్యడం వెనుక scientific reasons కూడా ఉన్నాయి అండీ.. యజ్ఞం చేసేపుడు అగ్ని హోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక వృక్షాల కట్టెలు వంటి వాటిని వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వెయ్యడం వచ్చే ధూమంవల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి కూడా. స్వచ్చమైన గాలి అందుతుంది. మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదండీ ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమౌతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెప్తారు.

మరి యజ్ఞాల వల్ల లాభాలు తెలుసుకునారుగా! ఇక నుండి మీ చుట్టూ పక్కల ఎక్కడ యజ్ఞం జరిగిన కొంత సమయాన్ని కేటాయించి వెళ్ళిరండి. అందువల్ల జరిగే మంచిని పొందండి.

About The Author