పాకిస్థాన్‌ క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం…


పాకిస్థాన్‌ క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. హజార్‌గంజ్ సబ్జి మండిలో ఐఈడీ బాంబు పేలడంతో.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి త్రీవ గాయాలైయ్యాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మృతులలో ఒకరు శాంతి భద్రతలు నిర్వహించే అధికారి ఉండగా.. మరో 8 మంది హజారా కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. సమాచారమందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూరగాయాలలో బాంబులు దాచి పేలుళ్లకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.

About The Author