శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రెసిడెంట్…

తిరుమల, ఏప్రిల్ 17: శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి బుధవారం ఉదయం వి ఐ పి బ్రేక్ లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ నుండి ఈ ఉదయం 6:10 గంటలకు మహాద్వారం చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన కు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి వెంట ఉండి తీసుకెళ్లారు.

ముందుగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మ్రొక్కి అనంతరం బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారి గర్భాలయ బయట నిలబడి శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం, వకుళామాత దర్శనం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు.

అలాగే, రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రీలంక ప్రెసిడెంట్ దంపతులకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు లు శ్రీ పద

About The Author