ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 535 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు మూడు దశల్లో (మే 6, 10, 14వ) పోలింగ్‌ జరగనున్నట్టు అందుకు ఇంకా రెండు రోజులలో అధికారికంగా నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఏప్రిల్ 22వ తేదీన మొదటి విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 6వ తేదీన మొదటి విడుత ఎన్నికలు జరుగనుండగా అందులో 212 జడ్పిటిసి, 2365 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన రెండో విడుత నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 26న విడుదల కానుండగా ఇందులో 199 జడ్పిటిసి, 2109 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 30న మూడో విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మూడో విడుతలో భాగంగా 124 జడ్పిటిసిలు, 1343 ఎంపిటిసి స్థానాలకు మే 14న పోలింగ్‌ జరగనుంది.
రాష్ట్రంలో మొత్తం 32,007 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 6,540 ఉండగా.. 600 మంది వరకు ఓటర్లున్న కేంద్రాలు 25,467 నిర్వహించనున్నారు. మొత్తం 13,651 పోలింగ్ లోకేషన్లను ఏర్పాటు చేయగా అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లుగా 64,014 మందిని నియమించనున్నారు. అదేవిధంగా 400 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రానికి ముగ్గురు, 600 మంది ఓటర్లున్న కేంద్రాలకు నలుగురు చొప్పున మొత్తం 1,21,488 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1,47,141 మంది పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు ఎస్‌ఈసి పేర్కొంది. 510 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, 129 లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేశారు.

*మెదటి దశలో ఎన్నికలు జరిగే జిల్లా:*
మేడ్చల్ మల్కాజిగిరి

*రెండు దశలో జరిగే జిల్లాలు*:
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్.

*మూడు దశలో జరిగే జిల్లాలు*
: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు.

About The Author