అమరావతిలో ఈదురు గాలులకు సచివాలయంలో దెబ్బతిన్న స్మార్ట్ పోల్, హైకోర్టు వద్ద గాయపడ్డ మహిళ…

మంగళవారం సాయంత్రం అమరావతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కాసేపు జనాలను పరుగులు పెట్టించింది… అనుకోని గాలుల బీభత్సానికి సచివాలయం లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోల్ పడిపోగా, నాలుగు,ఐదు బ్లాకుల లోని రూఫ్ దెబ్బతినింది… సచివాలయం మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోసం వేసిన టెంట్లు ధ్వంసం అయ్యాయు.

నేలపాడు లోని హైకోర్టు భవనం నుండి కిటికీ అద్దం జారిపడిన ఘటనలో అక్కడే పనిచేస్తున్న ఓ మహిళ గాయపడింది, గాయపడ్డ మహిళను అక్కడి సిబ్బంది ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు…

About The Author