ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు …


అమరావతి: ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఆశావర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు పలు సూచనలు చేశారు. శాఖ పనితీరును మెరుగుపరిచి సమూల ప్రక్షాళన దిశగా దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.
పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వైద్యఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్య రంగంలోని నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని..

About The Author