స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘ‌న‌ విజ‌యం…

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘ‌న‌ విజ‌యం సాధించినందుకు కృషి చేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌కు, నాయ‌కులకు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టికి ఎదురులేదని మ‌రోసారి ఈ ఎన్నికల్లో నిరూపితం అయింద‌న్నారు. ఇవే ఫ‌లితాలు రేప‌టి స్దానిక సంస్ధల ఎన్నిక‌ల కౌంటింగ్ లోనూ పునారావృతం అవుతాయ‌న్నారు. ఎన్నికల్లో విజ‌యం సాధించిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్య‌ర్ది శ్రీ పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, న‌ల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్య‌ర్ది శ్రీ తేరా చిన్న‌ప రెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో వీరి విజయానికి కృషి చేసిన మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ జ‌గ‌దీష్ రెడ్డి, శ్రీ మ‌ల్లారెడ్డి, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మరియు పార్టీ సీనియర్ నాయ‌కులు, అయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ రోజు కేటీఆర్ గారిని క‌లిసారు. ఈ సంద‌ర్భంగా మంత్రులకు, నాయ‌కుల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు, తర్వాత జరిగే జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక వరకు ఇదే ఉత్సాహాంతో పనిచేయాలని సూచించారు.

About The Author