కుప్పం నియోజకవర్గ నేతలతో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు భేటి…

అమరావతి

కుప్పం నియోజకవర్గ నేతలతో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు భేట

చంద్రబాబు కామెంట్స్

ఆధిక్యత తగ్గడానికి గల కారణాలను అన్వేషించాలని, ఈ ఫలితాలను నిశితంగా అధ్యయనం చేయాలని బాబు సూచన.

హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకు నీళ్లు తెచ్చాం. మరో 5ఏళ్లు ఉంటే సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించేవాళ్లం.

అసెంబ్లీ సమావేశాలు అనంతరం కుప్పం లో పర్యటిస్తా.

కుప్పంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. నేనే వచ్చి కూర్చుంటాను, ఏం చేయాలో,ఎలా చేయాలో అన్నీ చేద్దాం.*

పోరాటం మనకేమీ కొత్తకాదు, పలాయనం అనేది మనకు తెలియదు

ప్రజా సమస్యలపై పోరాటాన్ని నిరంతరం కొనసాగిద్దాం.

మనం ఎక్కడా ఏ తప్పు చేయలేదు. ధైర్యంగా ముందుకు పోదాం.

ముందు వాళ్లు చేస్తామని చెప్పినవన్నీ చేయనివ్వండి.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తెండి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వినియోగిస్తారు. కాబట్టి ఎవరి బలం ఎంతో అక్కడే తేలిపోతుంది.

కర్ణాటకలో చూశాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి గెలిచింది.

ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం’’

About The Author