డార్క్ వెబ్ పై అవగాహన సదస్సు…

 


సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో Digipol ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న సైబర్ క్రైం సదస్సు నేటితో ముగిసింది. డార్క్ వెబ్ పై జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన సదస్సుల్లో ఇది పెద్దది. సదస్సుకు దేశంలోని వివిఫ రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పశ్చిమ బంగా, దిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్ క్రైమ్స్ పోలీసులు హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యంగా డీప్ వెబ్, డార్క్ నెట్లలో సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఎలా గుర్తించాలి వంటి అంశాలు నేర్పించారు. డార్క్ వెబ్ లో వెబ్ హోస్ ద్వారా ఎలా సెట్ చేయాలి వంటి విషయాలను వివరించారు. ఇజ్రాయిల్కు చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు డాట్ నెట్ లో వివిధ టూల్స్ ద్వారా ఎలా సెర్చ్ చేయాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., డీఐజీ రాజేష్ కుమార్, సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., సైబర్ క్రైమ్స్ ఏసిపి శ్రీనివాస్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది, సైబర్ క్రైమ్స్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

About The Author