టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి చొరవతో వికలాంగునికి ద్విచక్ర వాహానం.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ గారి సూచన మేరకు స్ధానిక ఎమ్మెల్సీ శ్రీ శంబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు వాహానాన్ని తన నిధులతో కోనుగోలు చేసి, ఈ రోజు ప్రగతి భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో శివకు అందిచారు. ఈరోజు మంత్రి శ్రీ మల్లా రెడ్డి , ఎమ్మెల్సీ శ్రీ శంభిపూర్ రాజు, స్దానిక ఎమ్మెల్యే శ్రీ కె పి వివేకానంద్ సమక్షంలో శివకు ద్విచక్రవాహానాన్ని అందించారు.

About The Author