నేటి సాయంత్రం వరకే గడువు… సొంత పార్టీ వారివైనా సీజ్ చేయమని సీఎం ఆదేశం…


నేటి సాయంత్రం వరకే గడువు… సొంత పార్టీ వారివైనా సీజ్ చేయమని సీఎం ఆదేశం… రవాణా శాఖ మంత్రి పేర్ని నాని…!
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రవాణా, సమాచార శాఖ
మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు…

నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు తెరుచుకొన్న నేపథ్యంలో… స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించుకునే గడువు నేటి సాయంత్రం తో ముగియనుంది. ఈ అంశంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించిన మంత్రి పేర్ని నాని..

ఫిట్నెస్ లేని బస్సులను రేపటి నుండి సీజ్ చేస్తాం. నిన్నటి వరకు ఆడింది ఆటగా సాగింది, గత ప్రభుత్వం చూసి చూడని విధంగా వ్యవహరించింది, ఇప్పుడు ఏ స్కూల్ యాజమాన్యాలైనా, మా పార్టీ వారు ఆ యాజమాన్యాల్లో ఉన్నా ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే సీజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు…

మేము చాలా విజిలెంట్ గా ఉన్నాం, బస్సుల ఫిట్నెస్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉన్నా, లేక మీ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉన్నా మాకు ఇవ్వండి అని పేర్కొన్నారు #రవాణ_సమాచార శాఖామంత్రి.

విద్య శాఖ, రవాణా శాఖ కలిసి సమన్వయంతో ఉమ్మడిగా చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు #పేర్ని_నాని

#ఆంధ్రప్రదేశ్_ప్రభుత్వం, #ఏపి_రవాణశాఖ #స్కూల్‌బస్సులఫిట్‌నెస్ #పేర్నినాని

About The Author