ప్రజావేదిక… ప్రజల కోసమే… చంద్రబాబు విజ్ఙప్తిని తిరస్కరించిన జగనగ సర్కార్…

ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న అధికారులు

24న తొలి కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలోనే..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు వరుస షాక్‌లు తగులుతున్నాయి…

ఉండవల్లిలోని ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మధ్యహ్నం స్వాధీనం చేసుకుంది. ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న తరువాత… సీఆర్డీఏ, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రజావేదికను పరిశీలించి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వస్తువులను తొలగించాల్సిందిగా ఆ పార్టీ నేతలను ఆదేశించారు.

ప్రజావేదికలో ఈనెల 24న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అయితే తాజాగా ప్రజావేదికను కలెక్టర్ల సదస్సు కోసం, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

About The Author