బడ్జెట్ లో ఎపీకి మొండిచేయి చూపించిన కేంద్రం…


బడ్జెట్ లో ఎపీకి మొండిచేయి చూపించిన కేంద్రం

బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైకాపా ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ తమను నిరాశపరిచిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. ఏపీకి ఎన్ని నిధులిస్తున్నారనే విషయంపైనా స్పష్టత లేదని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

About The Author