ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్.. అమితాబ్ కుటుంబంపై కరోనా పంజా..


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కరోనా వైరస్ వెంటాడుతుంది. ఇప్పటికే ఆ కుటుంబంలో పెద్దాయన బిగ్ బికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన తర్వాత తనయుడు అభిషేక్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఇంట్లో అంతా టెస్టులు చేయించుకోగా మరోరెండు పాజిటివ్ కేసులు కూడా వచ్చాయి. అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది.
అమితాబ్ కుటుంబంలో అందరికీ టెస్టులు చేయగా..
ఇప్పటికే బిగ్ బి, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు పాజిటివ్ వచ్చింది. జయా బచ్చన్, అగస్త్య నందా, నివ్యా నవేలి, శ్వేతా బచ్చన్‌లకు మాత్రం నెగిటివ్ అని తేలింది. అమితాబ్ కుటుంబంలో ఒకేసారి నలుగురికి కరోనా రావడంతో అంతా కంగారు పడుతున్నారు. 80 ఏళ్లకు చేరువగా ఉన్న అమితాబ్.. పదేళ్లకు లోపు ఉన్న ఆయన మనవరాలు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు అభిమానులు, శ్రేయోభిలాషులు.

About The Author