ఘనంగా టాస్క్ ఫోర్స్ ఇంచార్జి కి వీడ్కోలు

తిరుపతి,2020 జూలై 29:పదోన్నతి పై బదిలీ అయిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ పి. రవిశంకర్ కు టాస్క్ ఫోర్స్ కు చెందిన వివిధ విభాగాలు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనకు గజమాల వేసి, జ్ఞాపిక ను బహుకరించారు. అన్ని విభాగాల ఉద్యోగులు శాలువు లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవి శంకర్ మాట్లాడుతూ తాను టాస్క్ ఫోర్స్ లో విజయం సాధించడానికి గతంలో ఐజీ గా పని చేసిన కాంతా రావు గారు కారణం అని తెలిపారు. ఆయన సూచనలతో టాస్క్ ఫోర్స్ ను ముందుకు నడిపించామని అన్నారు. అదే విధంగా ఉద్యోగులు అందరూ తన సూచనల ప్రకారం పని చేశారని అన్నారు. తన విజయానికి కారణం ఉద్యోగుల నిరంతర కృషే అని తెలిపారు. డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ విధి నిర్వహణ లో రవి శంకర్ గారి కృషి , పట్టుదల ఆయన ఉన్నతి కి కారణం అయ్యాయని అన్నారు. అదే బాటను తన విధి నిర్వహణ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ ఐలు భాస్కర్, ఆలీ భాషా, కృపానంద, సిఐ సుబ్రహ్మణ్యం, సిసి సత్యనారాయణ, ఎస్ ఐ చంద్ర శేఖర్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ లు వాసు, లింగాధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

About The Author