ఉపాధి హామీ పథకం రూ.5 లక్షల పరిహారంచెక్కును అందజేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ఆసరా,చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి:

తిరుపతి, 2020 జూలై 29:విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన నాగయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.5 లక్షల పరిహారం చెక్కును అందించారు. బుధవారం శిల్పారామంలో చెక్కును నాగయ్య భార్య సునీతకు ఎమ్మెల్యే చెవిరెడ్డి అందజేశారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మపల్లి లో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నాగయ్య ఫిబ్రవరి నెలలో మృతి చెందారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ తీసుకొని పరిహారం నిధులు త్వరితగతిన వచ్చేలా చర్యలు చేపట్టా రని సునీత  చెప్పుకొచ్చారు. అందుకు అధికారులు కూడా సహకరించారని తెలిపారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ పురం ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డి, ఏపీ ఓ హంసవేని, తిరుపతి ఏపీడి పద్మలత తదితరులు పాల్గొన్నారు.

About The Author