మెగాస్టార్ దేవుడు.. ఇక నుంచి విలన్ గా చేయను : సోనూసూద్


కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ ఇకపై విలన్‌గా చేయనని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. తను అలా ఎందుకు చెప్పాడు. ఏం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్‌లో సోనూసూద్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. కోవిడ్‌ సమయంలో ఎంతో చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు” అన్ని అన్నారు. నిజం దేవుడు లాంటి మంచి మనిషి ఆయన.. అంతే కాకుండా ఇకపై తాను విలన్‌గా సినిమాలు చేయనని, హీరోగా అవకాశాలు వస్తున్నాయని సోనూసూద్‌ తెలిపారు. తన దగ్గర ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్స్‌ ఉన్నాయని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభం చేద్దామనుకుంటున్నానని కూడా తెలిపారు సోనూసూద్‌.

About The Author