జెఈవో ఆదేశాల మేరకు తిరుపతిలో టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు


టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశాల మేరకు తిరుపతిలోని టిటిడి ఆస్తులకు, ఖాళీ స్థలాలకు అధికారులు శనివారం రక్షణ ఏర్పాట్లు చేశారు.

జెఈవో ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేశారు. టిటిడి ఆస్తులు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి చీఫ్ ఇంజనీర్ కు, ఎస్టేట్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగం, భద్రతా విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. జెఈవో ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం టిటిడి ఆస్తులకు కంచెను ఏర్పాటు చేసి, టిటిడికి చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంటలో 8 ఆస్తులు, వైకుంఠపురం, ఎంఆర్ పల్లిలో 14 ఆస్తులు కలిపి 22 ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

———————————————————————-

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

About The Author