ఘనంగా వలంద పాలెం రామాలయం శంకుస్థాపన…


మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ వలందపాలెం కొట్టే వారి వీధిలో గురువారం ఉదయం వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన “మన రామాలయం” పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య పురోహితులు శాస్త్రీయంగా హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపనను కలశ స్థాపనను చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ హిందూ బంధువులందరు పాత దేవాలయాలను పునర్నిర్మాణం చేయడం అభినందనీయమని దాతలు సహకరించాలని కోరారు. సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మచిలీపట్నంలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన మన రామాలయం అని రామాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కూడా జతపరచాలని కోరారు. రామాలయం నిర్మించే అరుదైన అవకాశం కమిటీకి దక్కిందని అన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం ఐక్యతకు నిదర్శనమని అన్నారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ మాట్లాడుతూ నగరంలోనూ చుట్టుపక్క గ్రామాలలో రామాలయాలు నిర్మాణం పెరగాలని ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇవన మణిబాబు, చంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్, వైఎస్ఆర్సిపి నాయకులు
శీలం బాబ్జి మాదిరెడ్డి బాబా, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కొట్టే జగన్మోహన్ రావు, తోట వి.వి.ఎస్ వరప్రసాదరావు, మిరియాల శివాజీ, కొట్టే సత్యనారాయణ, నల్లగోపుల సాయి, దాలిపర్తి నరసింహారావు, ఎర్రోజు సునీల్ బెజ కిరణ్,కొట్టే ఆంజనేయులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

About The Author