చిన్న పిల్లలను చిత్ర హింసలు పెట్టిన కసాయి తల్లిదండ్రులు.

సూర్యాపేట జిల్లా…
హుజుర్ నగర్ పట్టణంలో చిన్న పిల్లలను చిత్ర హింసలు పెట్టిన కసాయి తల్లిదండ్రులు.
నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజుర్నగర్ పట్టణంలో కిరాయికి ఉండి జీవనం సాగిస్తున్నారు.
వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
ధనుష్, రేవంత్ లను ప్రతి రోజు కొడుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
ఈ రోజు ఇద్దరి కొట్టి కాళ్ళు, చేతులు గంటే తో కాల్చినారు.
చిన్న పిల్లలు బాధ చూడలేక స్థానికులు పిల్లలు తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చినారు.
ఎస్సై నరేష్ చిన్న పిల్లలు బాధ చూడలేక మానవత్వంతో భోజనం పెట్టించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను స్థానికులకు అప్పగించిన్నాడు.
తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేసారు.
అవసరం అయితే పిల్లలు హోమ్ లో జాయిన్ చేపిస్తానని ఎస్సై నరేష్ వెల్లడించారు.
