తెలంగాణ పోలీసులపై, ఆంధ్రప్రదేశ్ రాజధాని… అమరావతిలో కేసు నమోదు…

తెలంగాణ పోలీసులపై, ఆంధ్రప్రదేశ్ రాజధాని… అమరావతిలో కేసు నమోదు…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న డేటా వార్… ఇప్పుడప్పుడే సమసేలా లేదు… తాజాగా, గత రాత్రి తెదేపా ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు నేతృత్వంలో ని తెలుగుదేశం బృందం, గుంటూరు రూరల్ ఎస్పీకి తెలంగాణ పోలీసుల అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది. అంతేకాక తమ పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలంగాణ పోలీసుల సహకారంతో ప్రతిపక్ష వైసీపీ పొందిందని, ఈ మొత్తం వ్యవహారానికి కుట్ర అమరావతి కేంద్రంగా జరిగింది అంటూ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు, వారు సమర్పించిన ప్రాధమిక ఆధారాలను పరిశీలించిన గుంటూరు రురల్ ఎస్పీ, ఎస్.వి రాజశేఖర్ బాబు, కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా తుళ్లూరు పోలీస్‌లను ఆదేశించారు.

గుంటూరు రురల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో IPC సెక్షన్లు 120B, 418, 429 ,380 ,409, 167 ,177,180D క్రింద కేసును రిజిస్టర్ చేసిన తుళ్ళూరు పోలీసులు తదుపరి చర్యలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

— స్రవంతీ చంద్ర

About The Author